ఈ విషయాన్ని అమెరికాకు చెందిన 'యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్ సీఐఆర్ఎఫ్)' అనే సంస్థ వెల్లడించింది. పలు దేశాల్లో మత స్వేచ్ఛపై ఈ సంస్థ పరిశోధనలు చేపడుతుంది. పాకిస్తాన్లో గడచిన ఏడాదిన్నర కాలంలో మతపరమైన దాడులు 203 జరుగగా, అందులో 700 మంది మరణించారు. మరో 1100 మంది గాయపడ్డారు.
ప్రధానంగా షియా వర్గాన్ని లక్ష్యం చేసుకుని ఆత్మాహుతి దాడులు జరుగుతుండగా, ఈ మధ్యకాలంలో హిందువులను టార్గెట్ చేసుకుని జరుగుతున్న దాడులు ఎక్కువ అయినట్టు చెప్పారు. ఫలితంగా హిందువులతో సహా ఇక్కడ నివసించే సిక్కు ప్రజలు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు.