Tuesday, July 23, 2013

'బికారీ పొలిటీషియన్లు'... ఉదయభాను మళ్లీ పుండు మీద కారం...

యాంకర్ ఉదయభాను మళ్లీ పుండు మీద కారం చల్లిందా... అంటే అవుననే అంటున్నారు. ఇప్పటికే ఓ పాటతో కొన్ని రాజకీయ పార్టీల గుండెల్లో మంట రాజేసిన ఈ యాంకర్ మళ్లీ నోరు తెరిచింది. ఇక్కడ బికారి బ‌తుకులుగా మాట‌లు చెబుతున్న కొంతమంది పొలిటిక‌ల్ బ‌తుకులు ఫారిన్‌లో ఎస్టేట్స్ క‌ట్టేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై మరింత లోతుగా ప్రశ్నించేసరికి సమాధానం చెప్పకుండా దాటవేసింది. ఐతే తన జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని భయపెడుతోందట.

కాగా ఇటీవల రేలారే రేలా ప్రోగ్రాములో వివాదాస్పద పాటను పాడి పొలిటికల్ గ్రౌండ్లో మంటపెట్టిన ఉదయభానుపై కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టిందని చెప్పుకుంటున్నారు. ఆ పార్టీ టార్గెట్ నిజంగానే పెట్టిందో లేదో తెలియదు కానీ, ఉదయభానుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట.

దీంతో ఆమె బెంబేలెత్తిపోతోందట. తనకు ప్రాణ హాని ఉన్నదంటూ తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంకోవైపు తెరాస లేదా భాజపాలోకి జంప్ అయ్యేందుకు మంతనాలు కూడా సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చూడాలి ఉదయభాను పొలిటికల్ ఫైరింగ్ ఎంతవరకూ వెళుతుందో...?!!